ఐటీ కంపెనీలు తరలిపోతున్నాయని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అన్నారు. విశాఖలో ఐటీ ప్రతినిధులతో మంత్రి గౌతమ్రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసత్య ప్రచారాలతో ఐటీ ఉద్యోగులు అభద్రతా భావంతో ఉన్నారన్నారు. విశాఖలో వచ్చే ఏడాదిలోగా 50వేల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు.