జగన్ పాలన పిచ్చి తుగ్లక్ పాలన మించిపోయింది. కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు. తులిసిరెడ్డి మాట్లాడుతూ ...పెనంలో నుంచి నిప్పుల పొయ్యిలో పడినట్లు ఉంది. వైసీపీ పాలన రద్దులు, వేధింపులు మారింది. శాసన మండలి రద్దు రాజశేఖర్ రెడ్డి కి వెన్ను పోటు పొడిచినట్లే. జగన్ కు అహంభావం అహంకారం ఎక్కువ. జగన్ చేతికి ఏకే 47 గన్ ఇచ్చిన మాదిరి ఉంది. నవరత్నాలు తుంగలో తొక్కారు. రాష్ట్రానికి ఒక్క రాజధాని లేక పోతే మూడు రాష్ట్రాల తో అభివృద్ధిఅంటా. రైతు భరోసా లో 5000 కోత విధించి ఇచ్చారు. పింఛన్లు రేషన్ కార్డులు రద్దు ప్రభుత్వం గా మారింది. రాష్టానికి బిజెపి చేసిన ద్రోహం మ ఏ పార్టీ కూడా చేయలేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని 58 సంవత్సరాల పాటు 16 మంది ముఖ్యమంత్రులు పాలనలో లక్ష కోట్ల అప్పు చేస్తే చంద్రబాబు ఐదేళ్లలో లక్ష 50 వేలుకోట్ల అప్పు చేయగా జగన్ ఎనిమిది నెలల్లో 50 వేల కోట్ల అప్పు చేశారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి పరిపాలన సాగిస్తున్నాడు. బిజెపి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాష్ట్రం విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అంశాలన్నింటినీ బిజెపి తుంగలో తొక్కింది. దేశంలో రాష్ట్రంలో గాంధేయ వాదానికి గాడ్సే వాదానికి మధ్య సైద్ధాంతిక పోరాటం జరుగుతోంది. ఒక్క అవకాశం ఇవ్వమని జగన్ కోరినట్లుగానే ఏపీ ప్రజలు సీఎం చేశారు.అయితే ఏపీ ప్రజలు ఆశించినంత అభివృద్ధి చేయలేకపోవడం దురదృష్టకరం . బిజెపి పార్టీ పట్ల జనసేన,వైసిపి,ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాగా నటిస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ప్రాంతాల నుండి కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉంటారు.