అరకు ఉత్సవాల్లకు సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించిన మంత్రి అవంతి. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ...అరకు ఉత్సవం ఫిబ్రవరి 29 మార్చ్ 1 వరకు జరగనుంది.పర్యాటక మరింత అబివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఈ ఫెస్టివల్ ని నిర్వహించడం జరుగుతుంది.ఈ ఉత్సవాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్, గిరిజన కళలు ప్రెసెంటషన్ ఇవ్వడం జరుగుతుంది.పర్యాటక ప్రాంతాల్లో గిరిజన యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సుమారు కోటి రూపాయల ఈ ఉత్సవం జరిపేందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ, జాయింట్ కలెక్టర్ శివ శంకర్, టూరిజం అధికారులు.