తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతలో ఎలాంటి మార్పులు జరగలేదని డీజీపీ కార్యాలయం ప్రకటించింది. దేశంలోనే అత్యంత హై-సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం జడ్ప్లస్ సెక్యూరిటిలో చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు, చేర్పులు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం మొత్తం 183 మందితో భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొంది. విజయవాడలో 135 మంది, హైదరాబాద్లో 48 మందితో భద్రత చేపట్టినట్లు తెలిపింది.