కడప జిల్లా చిన్నమండెం బెంగళూరు ప్రధాన రహదారిలోని రెడ్డివారిపల్లె బస్టాండ్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు కేశాపురం పంచాయతీలోని ముండ్లావాండ్లకోటకు చెందిన దామోదర్గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.