ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రజా చైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 19 నుంచి 45 రోజుల పాటు టీడీపీ ప్రజా చైతన్య యాత్రలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చైతన్య యాత్రలు చేయనున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 19న ప్రకాశం జిల్లా మార్టూరులో నిర్వహించే చైతన్య యాత్రలో పాల్గొననున్నారు.