ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2020, 06:24 PM

సీఎం జగన్ దమ్ముంటే ఆయనపై ఉన్న కేసులపై విచారణకు సహకరించాలి టీడీపీ నేత పట్టాభి సవాల్ విసిరారు. ఇవాళ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కుంటిసాకులు చెప్పి కోర్టు వాయిదాలు తప్పించుకోవడం కాదని దమ్ముంటే విచారణకు సహకరించాలన్నారు. 420 పనులు చేసి జగన్‌ వేల కోట్లు దండుకున్నారని విమర్శలు గుప్పించారు. దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చాడని పట్టాభి విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మీలా మనీల్యాండరింగ్‌ కేసులు లేవని చెప్పుకొచ్చారు.
'మహిళలపై నేరాల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉంది. ఇలాంటి ఐటీ దాడులకు భయపడాల్సిన అవసరం మాకు లేదు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడి జగన్‌ దేశం పరువు తీశాడు. సెజ్‌ల పేరుతో రసల్‌ ఖైమా కంపెనీని మోసం చేయలేదా?. సెర్బియాలో మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌ని అరెస్ట్‌ చేస్తే అతన్ని విడిపించడానికి వైసీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లారు' అని పట్టాభి విమర్శలు గుప్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com