ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రథానికి నిప్పు పెట్టిన ఘటనపై మంత్రి వెల్లంపల్లి సీరియస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2020, 02:35 PM

రథానికి నిప్పు పెట్టిన ఘటనపై మంత్రి వెల్లంపల్లి సీరియస్ః విచారణకు ఆదేశం. భక్తులెవరూ ఆందోళన చెందవద్దు.నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిగ్రుంటలో దుండగులు ఆలయ రథానికి నిప్పు పెట్టిన ఘటనపై దేవదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు.  విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీతో  ఫోన్లో మాట్లాడారు. దుండగులెవరో తక్షణం గుర్తించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.  ఘటనపై తక్షణ చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణిని ఆదేశించారు.  అలానే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.  ఆకతాయిలు, దుండగులు చేస్తున్న ఇటువంటి చర్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాల పరిరక్షణకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com