నెల్లూరు జిల్లా తడ మండలం పన్నంగాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు డీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంగోలు నుంచి చెన్నైకి నిన్న కుటుంబ సభ్యులు వెళ్లారు. అక్కడ మృతుల తల్లిదండ్రులను అమెరికాకు ఫ్లయిట్ ఎక్కించి తిరిగి వేకువజామున బయల్దేరారు. తడ వద్ద లారీని బలంగా కారు ఢీకొట్టింది. దీంతో ఓ వైపు కూర్చుని ఉన్న ఇద్దరు మహిళలు, ఓ ముక్కు పచ్చలరని చిన్నారి అక్కడికక్కడే మృతిచెందారు. మరో వైపు ఉన్న ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు