తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐటీ దాడులపై ఐటీశాఖ ప్రకటన చేసింది. మూడు ప్రముఖ ఇన్ ఫ్రా కంపెనీలపై జరిగిన దాడుల్లో రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించామని ఐటి శాఖ తెలిపింది. కీలకమైన సాక్ష్యాలు లభించాయి అని ఐటీ శాఖ వెల్లడించింది. 40 చోట్ల 5 రోజులపాటు ఐటీ అధికారులు సోదాలు జరిపారు. హైదరాబాద్, విజయవాడ, కడప , విశాఖ, ఢిల్లీ, పుణేలో ఐటీశాఖ సోదాలు నిర్వహించింది. నకిలీ బిల్లుల ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిపారు. ఆర్కే ఇన్ఫ్రా , ఏసీ&డి ఇన్ఫ్రా కంపెనీలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాయి. నకిలీ బిల్లులతో భారీగా లావాదేవీలు జరిపాయి అని ఐటీ శాఖ వెల్లడించింది