తిరుమల వేంకటేశుడి సేవలో తరించారు శ్రీలంక ప్రధాని రాజపక్సే. శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్, మంత్రి పెద్దిరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం రాజపక్షే తన కుమారుడు యోషితా, మంత్రి ఆర్ముగతంతో కలిసి అష్టదళ పద్మారాధాన, వీఐపీ బ్రేక్లో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వెంకన్నకు రాజపక్సే గోల్డ్ కాయిన్ సమర్పించారు.