ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2020, 06:37 PM

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిట్వేలి మండలంలోని, పుల్లంపేట ఘాట్ రోడ్డులో మినీ ట్రాన్స్ పోర్ట్ ఆటో బోల్తా పడటంతో 8 మందికి తీవ్ర గాయాలు అవ్వగా ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వివరాలలోకి వెళితే..నెల్లూరు జిల్లా గూడూరు సంత నుంచి 30 గొర్రెలతో పాటు 18 మంది మినీ ట్రాన్స్ పోర్ట్ ఆటోలో శుక్రవారం పుల్లంపేటకు వస్తుండగా ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని 108లో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అనంతరం తిరుపతి రూయాకు తరలించినట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com