కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిట్వేలి మండలంలోని, పుల్లంపేట ఘాట్ రోడ్డులో మినీ ట్రాన్స్ పోర్ట్ ఆటో బోల్తా పడటంతో 8 మందికి తీవ్ర గాయాలు అవ్వగా ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వివరాలలోకి వెళితే..నెల్లూరు జిల్లా గూడూరు సంత నుంచి 30 గొర్రెలతో పాటు 18 మంది మినీ ట్రాన్స్ పోర్ట్ ఆటోలో శుక్రవారం పుల్లంపేటకు వస్తుండగా ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని 108లో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అనంతరం తిరుపతి రూయాకు తరలించినట్టు సమాచారం.