శ్రీకాకుళం జిల్లా రాజాంలో నిన్న పెట్రోల్ దాడికి గురైన మైనర్ బాలిక నేడు చికిత్స పొందుతూ మృతి చెందింది. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు కన్నుమూసింది. బహిర్భూమికి వెళ్లిన చిన్నారిపై నిన్న గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. రాజాం పట్టణంలోని హరిజన వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 80 శాతం గాయాలతో నిన్న బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చారు.