ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులపై చేసిన ప్రకటనను మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పళ్లంరాజు సమర్థించారు. విశాఖను రాజధానిగా మారిస్తే బావుంటుందన్న అభిప్రాయాన్ని పళ్లంరాజు వ్యక్తం చేశారు. తిరుమలలో కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న పళ్లంరాజు మీడియాతో మాట్లాడారు. అయితే మూడు రాజధానులపై తాను చేస్తున్న వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని పళ్లంరాజు స్పష్టం చేశారు. రాజధాని తరలింపుపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని పీసీసీ చీఫ్ శైలజానాథ్ వెల్లడిస్తారని అన్నారు.