అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ రాజధాని రైతులు చేపట్టిన ఆందోళన నేడు 38వ రోజుకు చేరింది. మందడంలో రైతులు, మహిళలు ధర్నా నిర్వహిస్తున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెం, తుళ్లూరు, మంగళగిరిలలో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లుకు బ్రేక్ పడటంతో రైతులకు కాస్త ఊరట లభించింది. అయినప్పటికీ ఉద్యమం ఆపబోమని రైతులు పేర్కొన్నారు. నేటినుంచి మరింత ఉధృతంగా ఉద్యమాన్ని నిర్వహించాలని ఆందోళనకారులు నిర్ణయించారు.