ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరి ఎక్స్‌ప్రెస్‌ రాక, పోక సమయాల్లో మార్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2020, 08:41 AM

గుంటూరు: నిత్యం హైదరాబాద్‌ - తిరువనంతపురం మధ్యన గుంటూరు మీదగా రాకపోకలు సాగించే శబరి ఎక్స్‌ప్రెస్‌ రాక, పోక సమయాల్లో ఈ నెల 27వ తేదీ నుంచి మార్పులు చోటు చేసుకోనున్నాయి.ఈ రైలు హైదరాబాద్‌ నుంచి కాకుండా నిర్ణీత తేదీ నుంచి సికింద్రాబాద్‌కు టర్మినల్‌ పాయింట్‌ని మార్చారు. దీంతో ఈ రైలు సికింద్రాబాద్‌ - తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్‌గా మారుతుంది. 


సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి చర్లపల్లికి 12.37కి, నల్గొండకు మధ్యాహ్నం 2 గంటలకు, మిర్యాలగూడకు 2.25కి, నడికుడికి 3.10కి, పిడుగురాళ్లకు 3.30కి, సత్తెనపల్లికి సాయంత్రం 4.04కి, గుంటూరుకు 5 గంటలకు చేరుకొని 5.20కి బయలుదేరుతుంది.తిరువనంతపురం - సికింద్రాబాద్‌ శబరి ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 6.28కి తెనాలి, 6.55కి గుంటూరు, 7.40కి సత్తెనపల్లి, 8.04కి పిడుగురాళ్ల, 8.25కి నడికుడి, 8.55కి మిర్యాలగూడ, 9.25కి నల్గొండ, 11.24కి చర్లపల్లి, మధ్యాహ్నం 12.10కి సికింద్రాబాద్‌ చేరుకొని ప్రయాణం నిలిచిపోతుంది. ఈ మార్పులను ప్రయాణీకులు గమనించాలని సీనియర్‌ డీసీఎం డీ నరేంద్రవర్మ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com