గుంటూరు: నిత్యం హైదరాబాద్ - తిరువనంతపురం మధ్యన గుంటూరు మీదగా రాకపోకలు సాగించే శబరి ఎక్స్ప్రెస్ రాక, పోక సమయాల్లో ఈ నెల 27వ తేదీ నుంచి మార్పులు చోటు చేసుకోనున్నాయి.ఈ రైలు హైదరాబాద్ నుంచి కాకుండా నిర్ణీత తేదీ నుంచి సికింద్రాబాద్కు టర్మినల్ పాయింట్ని మార్చారు. దీంతో ఈ రైలు సికింద్రాబాద్ - తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్గా మారుతుంది.
సికింద్రాబాద్లో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి చర్లపల్లికి 12.37కి, నల్గొండకు మధ్యాహ్నం 2 గంటలకు, మిర్యాలగూడకు 2.25కి, నడికుడికి 3.10కి, పిడుగురాళ్లకు 3.30కి, సత్తెనపల్లికి సాయంత్రం 4.04కి, గుంటూరుకు 5 గంటలకు చేరుకొని 5.20కి బయలుదేరుతుంది.తిరువనంతపురం - సికింద్రాబాద్ శబరి ఎక్స్ప్రెస్ ఉదయం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 6.28కి తెనాలి, 6.55కి గుంటూరు, 7.40కి సత్తెనపల్లి, 8.04కి పిడుగురాళ్ల, 8.25కి నడికుడి, 8.55కి మిర్యాలగూడ, 9.25కి నల్గొండ, 11.24కి చర్లపల్లి, మధ్యాహ్నం 12.10కి సికింద్రాబాద్ చేరుకొని ప్రయాణం నిలిచిపోతుంది. ఈ మార్పులను ప్రయాణీకులు గమనించాలని సీనియర్ డీసీఎం డీ నరేంద్రవర్మ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.