ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళకు పెరిగిన దేశీయ పర్యాటకులు

national |  Suryaa Desk  | Published : Wed, Jan 22, 2020, 08:00 AM

 కేరళకు దేశీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత త్రైమాసికంలో 16 శాతం వృద్ధిరేటు నమోదైందని పర్యాటకశాఖ అధికారులు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కేరళ టూరిజం పార్ట్‌నర్‌షిప్‌ మీట్‌ 2020 కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సతృపదత్‌, కేరళ పర్యాటకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మురళీధరన్‌ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశీయ పర్యాటకులతోపాటు విదేశీ పర్యాటకులు కూడా పెరిగారని అన్నారు. ప్రకృతి వైపరిత్యాలు ఎదుర్కొని కేరళ పర్యాటకం నిలబడిందన్నారు.


తెలంగాణ ప్రాంతము నుండి కేరళ పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి ఎక్కువ మొత్తంలో వస్తున్నారని, పర్యాటకులను ఆకర్షించే ఎన్నో అందాలు కేరళ స్వంతమని అన్నారు. అందుకే కేరళను పర్యాటకుల స్వర్గధామని పిలుస్తారని అన్నారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే విషయంలో కేరళ రాష్ట్రం ముందు వరుసలో ఉందని అన్నారు. రెండవ విడత క్యాంపేయిన్‌లో భాగంగా పది భారతీయ నగరాల్లో భాగస్వామ్య సమావేశాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు.భారత దేశమంతటా ముఖ్యమైన నగరాల్లో వాణిజ్య ఉత్సవాలు జరుగబోతున్నట్లు చెప్పారు. మొదటగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


 


a






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com