ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్భయ కేసులో దోషి పవన్‌ గుప్తా పిటిషన్‌ కొట్టివేత

national |  Suryaa Desk  | Published : Tue, Jan 21, 2020, 07:08 AM

 నిర్భయ కేసులో నలుగురు దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా పిటిషన్‌ సుప్రీం కోర్టు కొట్టివేసింది. నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్‌ అని పవన్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఇప్పటికే పవన్‌ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. నిర్భయ దోషులకు ఢిల్లీ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫిభ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు పరచాల్సిందిగా డెత్‌ వారెంట్‌లో పేర్కొంది.


ఘటన సమయంలో పవన్‌ మైనర్‌ అని, అతని స్కూల్‌ సర్టిఫికెట్‌లో కూడా అతడు మైనర్‌ అని చెప్పడానికి ఆధారాలున్నాయని దోషి తరపు న్యాయవాది ఏపీ సింగ్‌ కోర్టుకు తెలిపారు. ఢిల్లీ హైకోర్టు ఈ విషయాన్ని పరిగణించలేదని ఏపీ సింగ్‌ సుప్రీం కోర్టుకు వెల్లడించారు. ఐతే పవన్‌ గుప్తా మైనర్‌ కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కాలయాపన కోసమే పిటిషన్‌ వేశారని కోర్టు పేర్కొంది. ఒకే అంశంపై మళ్లీ మళ్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయరాదని, పిటిషన్‌ విచారణకు అర్హత లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పవన్‌ గుప్తా తరఫు న్యాయవాదిని కోర్టు మందలించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com