అభివృద్ధి అంటే 5 కోట్లు మందికి చెందాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికి దక్కాలని అన్నారు. జీఎన్ రావు, బోస్టన్ గ్రూప్ నివేదిక ఇచ్చారు. అందుకే సీఆర్డీఏని రద్దు చేయాలని నిర్ణయించాం అని అన్నారు. ప్రాంతీయ అసమానతలు వల్లే రాష్ట్ర విభజన చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు అని అన్నారు. గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదు అని అన్నారు. ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల అవసరాలను గమనించాలి అని అన్నారు. వనరులన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదు అని అన్నారు. భూములిచ్చిన రైతుల కౌలు రూ. 5 వేలకు పెంచుతున్నాం అని అన్నారు. భూములిచ్చిన రైతులకు 15 ఏళ్ల వరకు కౌలు ఇస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన ప్యాకేజీ రైతులకు ఇస్తాం బొత్స అన్నారు.