సీఎం జగన్ నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ను నాలుగు పరిపాలన జోన్లుగా విభజించాలని నిర్ణయించారు. జిల్లాల విభజన తర్వాత సూపర్ కలెక్టరేట్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, మంత్రులు రెండు చోట్లా అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, రాజధాని రైతు కూలీలకు పరిహారం పెంపునకు ఆమోదం తెలిపారు. ఈ పరిహారం రూ. 2500 నుంచి రూ.5వేలకు పెంచారు. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే కౌలు పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతూ నిర్ణయించారు.