కడప నుంచి విజయవాడ వెళ్తున్న ట్రూ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. కడపలో టేకాఫ్ తీసుకున్న కాసేపటికే విమానాన్ని పక్షి ఢీకొంది. విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో కడప ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎమర్జెన్సీ ల్యాండిగ్ తో విజయవాడ-కడప, కడప-చెన్నైల మధ్య సర్వీసులు రద్దు చేశారు. ప్రత్యామ్మయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల మరో విమానంలో హైదరాబాద్ కు బయల్దేరి వెళ్లారు.