కడప జిల్లా...పెద్దముడియం మండలం గుండ్లకుంట గ్రామానికి చెందిన పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని సోమవారం అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్ళితే... గత మూడు రోజులుగా గుండ్లకుంట ప్రభుత్వ పాఠశాల తరుపున విహార యాత్రకు వెళ్లిన విద్యార్థులు. సోమవారం ఉదయం యాత్రను ముగించుకొని వచ్చారు. ఈ మేరకు ఆ విద్యార్థిని ఇంటికి రాగానే ఆరోగ్యం బాగాలేదని తల్లిదండ్రులకు తెలుపగా వారు జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. దీంతో వైద్యులు ఆ విద్యార్ధిని ఆరోగ్య పరిస్ధితిని పరిక్షించి... చికిత్స చేస్తుండగానే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దాంతో ఆ విద్యార్దిని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ సంఘటన సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.