నరసాపురం: సంక్రాంతి రద్దీని పురస్కరించుకుని నరసాపురం-సికింద్రాబాద్ మధ్య ఆరు స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి జనవరి 10, 11, 12, 13 తేదీల్లో ఈ స్పెషల్ రైళ్లు బయలుదేరనున్నాయి. తిరుగు ప్రయాణంలో నరసాపురం నుంచి 18, 19 తేదీల్లో నడవనున్నాయి. 10న 82725 నెంబర్తో సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరే ఈ ఎక్స్ప్రెస్ రైలు నల్లగొండ, గుంటూరు మీదుగా ఉదయం 4.30 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. 11వ తేదీ సాయంత్రం 7.20 గంటలకు బయలుదేరి గుంటూరు మీదుగా ఉదయం 6 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.
12, 13 తేదీల్లో 07256 నెంబర్తో రాత్రి 7.25 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి ఉదయం 6 గంటలకు నరసాపురం రానున్నాయి. 18వ తేదీన 07255 నెంబర్తో నరసాపురంలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ఎక్స్ప్రెస్ గుంటూరు మీదుగా హైదరాబాద్ వెళ్లనుంది. 19న నరసాపురంలో 8.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు సికింద రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు వరంగల్, ఖమ్మం మీదుగా వెళ్తుంది.అడ్వాన్స్ రిజర్వేషన్లు.ఈ ఆరు ఎక్స్ప్రెస్ రైళ్లకు గురువారం నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. అన్లైన్ లేదా రిజర్వేషన్ కౌంటర్లలో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చునని ఎస్ఎం మధుబాబు తెలిపారు.