తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. గతేడాదికంటే మెరుగ్గా సదుపాయాలు కల్పిస్తామని అయన అన్నారు. చలిగాలులు తగలకుండా నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో జర్మన్ టెక్నాలజీతో షెడ్లు ఏర్పాటు చేస్తున్నామని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 4న వైకుంఠ ద్వారా దర్శనానికి కంపార్ట్ మెంట్లలోకి భక్తులను అనుమతించనున్నారు. కంపార్ట్ మెంట్లల్లో భక్తులకు మంచి నీరు, అన్న ప్రసాదాలు పంపిణి చేయనున్నామని అయన తెలిపారు