ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ తవ్వుతోంది అవినీతిని కాదు.. వైసీపీని పూడ్చిపెట్టే గొయ్యి : లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 28, 2019, 03:57 PM

 గత ఏడు నెలలుగా జగన్ తవ్వుతోంది అవినీతిని కాదని.. వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టేందుకు గొయ్యి అని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ట్వీట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ… ఆధారాలు బయటపెట్టమని అడిగితే జగన్ కాకి లెక్కలు చెబుతున్నారన్నారు. ‘‘4,075 ఎకరాలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారని, ఐదేళ్ల టీడీపీ పాలనలో అమరావతి ప్రాంతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు 1170 ఎకరాలేనన్నారు. మరి 4,075 ఎకరాల ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగిందో భ్రమల్లో బతుకుతున్న వైసీపీ నాయకులు, ఉపసంఘం మేధావులే చెప్పాలన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై న్యాయ విచారణకు మేం సిద్ధం’’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com