ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2019, 07:09 PM

ఏపీ సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు ఏపీ అసెంబ్లీ సోమవారం ఆమోదం తెలిపింది. జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతారని జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల కోసం రూ.3600 కోట్లను జగన్ సర్కారు భరించనుందని తెలిపింది. ప్రతి ఉద్యోగి సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నామని జగన్ తెలిపారు. చిరునవ్వుతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో 52 వేల మంది ఆర్టీసీ కార్మికులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారు. ఇప్పటికే జగన్ సర్కారు ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కోసం ప్రజారవాణా శాఖను కూడా తీసుకొచ్చేందుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ మాటిచ్చారు. అందుకు తగ్గట్టుగానే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక విలీనం దిశగా అడుగులేశారు. కానీ ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉండటంతో.. సంస్థను విలీనం చేయడం కుదరలేదు. దీంతో ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇటీవలే నివేదికను సమర్పించగా.. దానికి అనుగుణంగా.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. చట్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com