ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్భయ చట్టంలో లొసుగులు: ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2019, 06:52 PM

దేశంలో మహిళలకు స్వాతంత్య్రం రాలేదని రాష్ట్ర హోం మంత్రి సుచరిత అన్నారు. తాడేపల్లిగూడెంలో ఒక ప్రైవేటు పాఠశాలలో దిశ చట్టంపై విద్యార్థులు నిర్వహించిన అభినందన సభలో ఆమె మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా 30 లక్షల నేరాలు నమోదవుతుంటే రాష్ట్రంలో 1.50 లక్షల నేరాలు ఉన్నాయని తెలిపారు. అందులో ప్రతీ ఏటా మన దేశంలో 15 వేల కేసులు మహిళలకు సంబంధించి నమోదు కావడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. మహిళలపై అకృత్యాలు జరిగే దేశాల్లో మన దేశం ప్రథమ స్థానంలో ఉండడం సిగ్గు చేటని ఆవేదన వెలిబుచ్చారు. నిర్భయ ఘటనతో కేంద్రంలో చట్టం చేసినప్పటికీ.. అందులో లొసుగుల కారణంగా నేరస్థులను జైలులో మేపుతున్నారని మండిపడ్డారు. మహిళా రక్షణకే దిశ చట్టం తెచ్చామన్నారు. ప్రతి పాఠశాలలోనూ మహిళలకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించేలా బోర్డులు పెట్టాలని సూచించారు. మహిళలకు ఆపద వస్తే 100, 1012, 181 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. అనంతరం హోం మంత్రిని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com