మద్యపాన నిషేధం చర్చ జరుగుతుంటే ముఖ్యమంత్రి పారిపోయారంటూ వైసిపి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. మొన్న ఉల్లి ధర పెరిగిందని మెడలో ఉల్లిపాయలు వేసుకొచ్చారని.. ఇప్పుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు మద్యం ధరలు పెరిగాయని.. మద్యం సీసాలు మెడలో వేసుకొస్తారేమోనని తాను భయపడ్డానని అయితే అలా చేయకపోవడం ఆనందంగా ఉందని మద్యంపై చర్చిస్తామంటే ముఖ్యమంత్రి పారిపోతున్నారని, తనదైన ధోరణిలో విమర్శలు ఆరంభించారు.
రోజా వ్యాఖ్యలతో ఉలిక్కి పడ్డ వైసిపి సభ్యులు ఆమె తామింకా విపక్షంలోనే ఉన్నట్టు మాట్లాడుతోందని, అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడిచినా అధికారిక హోదాని అందుకున్నా, మాట తడబడటంపై ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో వైసిపి సభ్యుడొకరు కాగితంపై విషయం రాసి అందివ్వగా నాలిక కరచుకుని తన పొరపాటు గుర్తించి క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు పారిపోయారంటూ రోజా తన వ్యాఖ్యలను సరిచేసుకున్నారు. ఇదండీ సంగతి....