అత్యాచారం కేసులో అనంతపురం మహిళా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. వృద్ధురాలిపై అత్యాచారం కేసులో ఓ యువకుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కంబదూరు మండలం అండేపల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసుపై అనంతపురం మహిళా కోర్టు విచారణ జరిపింది. వాదోపవాదలను విన్న కోర్టు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుపై మహిళా సంఘాలు, బాధిత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.