ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మద్యపాన నిషేధం అంశంపై ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మద్యం పాలసీతో కొన్ని లక్షల మంది కుటుంబాలు అన్యాయమైపోయాయని రూ. 75వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగి ప్రభుత్వం నడిచేందుకు మద్యాన్ని ఇంధనంగా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పేదల జీవితాలను విచ్చిన్నం చేసేమద్యం అంటే చంద్రబాబుకు అంత మక్కువ అని ఎద్దేవా చేసారు.
రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలొ ఏర్పడ్డ 43వేల బెల్ట్ షాపులను తొలగించి, 40 శాతం బార్లు కూడా తగ్గించిన ఘనత జగన్దని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుని చరిత్ర సృష్టించేలా. మద్యపాన నిషేధంపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి మహిళా అభినందిస్తోందని రోజా అన్నారు.