ఏపీలో ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదించింది. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అంతకుముందు, హౌస్ లో ప్రవేశపెట్టిన బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లు ఆమోదించడంపై వైసీపీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టారు.