దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆ దేశ జాతీయ జట్టు తరుపున మళ్లీ బ్యాట్ పట్టనున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్కప్ ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఏబీ డివిలియర్స్తో చర్చలు జరుపుతానని దక్షిణాఫ్రికా కొత్త కోచ్ మార్క్ బౌచర్ అన్నాడు. మార్క్ బౌచర్ శనివారం దక్షిణాఫ్రికా కోచ్గా నియమితుడయ్యాడు. 2023 వరకూ బౌచర్ కోచ్గా కొనసాగనున్నాడు. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్కప్కు అత్యుత్తమ ఆటగాళ్లతో జట్టును ఉంచడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని చెప్పిన మార్క్ బౌచర్... ఇందులో భాగంగా రిటైర్మెంట్ తీసుకున్న ఏబీతో మాట్లాడతానని చెప్పాడు. "ప్రపంచకప్లో అత్యుత్తమ ఆటగాళ్లు జట్టుకు ప్రాతినిధ్యం వహించాలి. ఏబీ డివిలియర్స్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడన్నది నా ఉద్దేశం. నేనెందుకు అతడితో మాట్లాడకూడదు? ఇప్పుడే బాధ్యతలు అందుకున్నా. ఏబీతో పాటు మరికొంతమంది రిటైర్డ్ ఆటగాళ్లతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను" అని మార్క్ బౌచర్ వెల్లడించాడు.