సోమవారం జార్ఖండ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తన తీర్పును వెలువరించిందని, ఇక రానున్న 4 నెలల్లో రామ మందిరాన్ని అక్కడ నిర్మించనున్నట్లు చెప్పారు. జార్ఖండ్లో కాశ్మీర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ ఇప్పుడు భారత్లో భూభాగంగా మారిందని, భారత్లో కాశ్మీర్ను కలపడం కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదా అని షా తన ప్రసంగంలో ప్రశ్నించారు.