నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించిన నూతన టీడీపీ జాతీయ కార్యాలయాన్ని ఇటీవలే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆ కార్యాలయానికి న్యాయ పరమైన చిక్కులు ఎదురయ్యాయి. మంగళగిరిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే వేసిన పిల్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం ప్రభుత్వానికి, కలెక్టర్, టీడీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై టీడీపీ ఇంతవరకూ రియాక్ట్ అవ్వలేదు.