కాట్రెల్ వేసిన బంతిని స్క్వేర్ లెగ్లోకి రాహుల్ ఆడబోయాడు అయితే అది కాస్తా ఎడ్జ్ తీసుకోవడంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హెట్మెయిర్ చేతుల్లో పడింది. దాంతో జట్టు స్కోరు 21 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ను నష్టపోయింది. ఇక కోహ్లిది బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఫోర్ కొట్టి ఊపు మీద ఉన్న కోహ్లిని కాట్రెల్ చక్కటి బంతితో పెవిలియన్కు పంపాడు. కాట్రెల్ తక్కువ ఎత్తులో కాస్త ఎడంగా వేసిన బంతిని థర్డ్ మ్యాన్ దిశగా పంపాలని కోహ్లి యత్నించగా అది కాస్తా మిస్ కావడంతో వికెట్లపైకి దూసుకుపోయింది. దాంతో జట్టు స్కోరు 25 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ను నష్టపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫలితంగా తొలుత టీమిండియా బ్యాటింగ్కు దిగాల్సి వచ్చింది.