ఎన్సీబీ దేశంలోని పలుచోట్ల దాడులు చేసి రూ. 100 కోట్ల విలువైన 20 కేజీల నాణ్యమైన కొకైన్ను స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ ముఠాకు చెందిన 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ శనివారం తెలిపింది. వీరిలో అయిదుగురు భారతీయులు, ఇద్దరు నైజీరియన్లు, ఒక అమెరికన్, ఒక ఇండోనేషియన్ మహిళ ఉన్నట్లు వెల్లడించింది. త్వరలో రానున్న నూతన సంవత్సర వేడుకల్లో దీన్ని విక్రయించేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.