మద్యం మత్తులో ఓ మాజీ క్రికెటర్ విచక్షణ కొల్పోయాడు తన పక్కింటివారిపైనే దాడి చేశాడు. ఏడేళ్ల చిన్నారిని సైతం తోసేశాడు. ఈ ఘటనలో గాయాలపాలైన బాధిత కుటుంబం పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ మీరట్లో మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ నివాసం ఉంటున్నాడు. అయితే... ఆయన పక్కన దీపక్ శర్మ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇద్దరు నైబర్స్. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దీపక్ శర్మ తన కొడుకుతో కలిసి బస్ స్టాప్ వద్ద వేచి చూస్తుండగా అక్కడకు ప్రవీణ్ కుమార్ కారులో వచ్చాడు. కారు దిగి ముందుగా అక్కడున్న బస్ డ్రైవర్ను దుర్భాషలాడాడు. ఆ తర్వాత తనపై చేయిచేసుకున్నాడని దీపక్ శర్మ తెలిపాడు. అక్కడున్న తన కొడుకును వెనక్కి తోసేశాడని తెలిపాడు. ప్రవీణ్ చేసి దాడిలో తన చేయికి ఫ్యాక్చర్ అవ్వగా... తనకుమారుడుకు వీపు భాగంలో భారీ గాయం తగిలిందని ఆరోపించాడు. అయితే ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించగా... వారి కేసు నమోదు చేసేందుకు వెనుకాడన్నారు. ఇంటర్నేషనల్ క్రికెటర్ విషయంలో ఫిర్యాదు రావడంతో.. ఉన్నతాధికారులను కలవాలని పోలీసులు తెలిపినట్లుగా దీపక్ శర్మ ఆరోపిస్తున్నాడు. తనను చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.