అమరావతి: ఐదో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. ఎన్నికల తర్వాత చాలా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం, అన్ని ప్రభుత్వ శాఖల్లో బిల్లులు పెండింగ్ పై టీడీపీ ప్రశ్నలు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ పై విచారణ, రివర్స్ టెండరింగ్ ద్వారా నిధుల మిగులు, రాజధానిలోని కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ లో అక్రమాలపై వైసీపీ ప్రశ్నలు. అవినీతి నిర్మూలన, పారదర్శకత, జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ పై స్వల్పకాలిక చర్చ. శాసన మండలిలో రాష్ట్ర రాజదాని మార్పు, సన్న బియ్యం సరఫరాపై టీడీపీ సభ్యుల ప్రశ్న. రాష్ట్రంలో శాంతిభద్రతలు, అమరావతి నిర్మాణంపై మండలిలో స్వల్ప కాలిక చర్చ.