వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి టీటీడీ అధికారులు కృషి చేస్తున్నారు. జనవరి 6, 7 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మూలవర్లతో పాటు వైకుంఠ ద్వారాలను దర్శిస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారు. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మాడవీధుల్లో తాత్కాలిక షెడ్లను నిర్మించి.. చలికి, ఎండకు ఇబ్బంది లేకుండా జర్మన్షీట్లతో కప్పుతున్నారు.