ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైస్సార్సీపీ ప్రభుత్వం అహంకారంతో ప్రవర్తిస్తోంది : చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2019, 06:34 PM

వైస్సార్సీపీ ప్రభుత్వం అహంకారంతో ప్రవర్తిస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలకు సమన అవకాశం కల్పించాలని అయన అన్నారు. మెజారిటీ ఉందని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అయన అన్నారు. స్పీకర్ ప్రవర్తన నిర్లక్ష్యంగా ఉంది.  ఆర్టీసీ చార్జీలు పెంచడం దారుణమని అన్నారు.  ఆర్టీసీ చార్జీల పెంపుపై సభలో చర్చించాలని కోరామని అన్నారు. ఆర్టీసీలో నిత్యం 70 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీలో ఎక్కువగా ప్రయాణించేది పేదవారేనని అయన అన్నారు. ప్రభుత్వం తప్పులు చూపుతున్నామని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని అన్నారు. వరదలు వచ్చినప్పుడు నీటిని నిల్వ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నా ఇంటిని ముంచడంపైనే శ్రద్ద చూపారని అయన అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com