ఆదివారం భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే దేశవాళీ టోర్నీలో యువ బ్యాట్స్మన్ సంజు శాంసన్ రాణించినా టీమిండియా జట్టులో మాత్రం చోటు దక్కట్లేదు. 2015లో జింబాబ్వేతో అరంగేట్రం చేసిన శాంసన్కు రెండో అవకాశం రాలేదు. జట్టులో చోటు కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. బంగ్లాదేశ్ సిరీస్కు ఎంపిక అయినా.. మూడు టీ20ల్లో తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఇక విండీస్ సిరీస్కు మొదటగా అవకాశం రాలేదు. అయితే ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడటంతో శాంసన్కు భారత సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో చోటు దక్కలేదు. ఇక రెండో మ్యాచ్ జరుగుతున్న తిరువనంతపురం శాంసన్ సొంత మైదానం. అందుకే ఈ మ్యాచులో సంజుకి అవకాశం ఇవ్వాలి ఆందోళనలు చేస్తున్నారు. టిను యోహానన్, శ్రీశాంత్ తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడో కేరళ ఆటగాడు సంజు శాంసన్. 'తొలి మ్యాచ్లో కేఎల్ రాహుల్ బాగా ఆడాడు. అయినా మా యువ ఆటగాడు శాంసన్ రెండో టీ20 మ్యాచులో ఆడతాడన్న నమ్మకం ఉంది. ఎందుకంటే అతడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. వర్షసూచన ఉండటంతో 20 ఓవర్ల మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహముంది ' అని కొందరు స్థానిక యువకులు అంటున్నారు. పరోక్షంగా రిషబ్ పంత్ స్థానంలో చోటు ఇవ్వాలని వారు అంటున్నారు.