కర్నూలు జిల్లా నంద్యాలలో పీటలపై పెళ్లి నిలిచిపోయింది. పెళ్లి కొడుకు మోహన్ కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి కొడుకు మోహన్ కృష్ణ గతంలో వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇపుడు వేరే అమ్మాయితో పెళ్ళికి సిద్ధమైయాడు. నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి పోలీసులకు పిర్యాదు చేయడంతో పెళ్ళికొడుకు మోహన్ కృష్ణను అరెస్ట్ చేశారు. మోహన్ కృష్ణ ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ గా పని చేస్తున్నాడు.