ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిత్యానందకు ఆశ్రయం కల్పించ‌డంపై క్లారిటీ ఇచ్చిన ఈక్వెడార్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2019, 09:15 PM

ఇటీవల ఈక్వెడార్‌ రాయబార కార్యాలయం వివాదస్పద స్వామిజీ నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలపై స్పందించింది.ఏ మాత్రం ఆ వార్తలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. తమ ప్రభుత్వం ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తిరస్కరించినట్టు తెలిపింది. దీంతో అతను ఈక్వెడార్‌ నుంచి హైతీ వెళ్లాడని చెప్పింది. నిత్యానంద ఈక్వెడార్‌ నుంచి ద్వీపం కొనుగోలు చేసాడని వస్తున్న వార్తలను ఖండించింది.
ఇక అస్సలు విషయానికి వస్తే తాము ఎలాంటి సాయం నిత్యానందకు చేయలేదని వెల్లడించింది. కైలాస వెబ్‌సైట్‌లోని సమాచారం ఆధారంగా పలు కథనాలు నిత్యానందకు చెందిన విధంగా వెలువడ్డాయని.. అందులో ఎటువంటి వాస్తవాలు లేవని తెలిపింది. ఈక్వెడార్‌ పేరును నిత్యానందకు సంబంధించిన విషయాల్లో వాడటం మానుకోవాలని మీడియాను కోరింది.
కాగా, ఇటీవల ఈక్వెడార్‌ నుంచి తాను ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు దానికి కైలాస పేరుపెట్టినట్టు నిత్యానంద ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ఓ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. కైలాస అనేది రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి​ చేస్తోందని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం నిత్యానంద అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అంతే కాదు తనను కాపాడుకోవడానికి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.
కేంద్రం దీనిపై స్పందించి దేశం ఏర్పాటు చేయడమనేది అంత సులువు కాదు .భారత విదేశాంగ శాఖ నిత్యానంద పాస్‌పోర్ట్‌ రద్దు చేసిందని తెలిపింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్‌ మాట్లాడుతూ.. గత నెల నుంచి కనబడకుండా పోయిన నిత్యానంద ఆచూకీని కనుగొనేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే అతను పెట్టుకున్న కొత్త పాస్‌పోర్ట్‌కై దరఖాస్తు పెండింగ్‌లో ఉందని చెప్పారు. నిత్యానంద కైలాస దేశంపై స్పందిస్తూ. ఒక దేశం ఏర్పాటు చేయడం వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసినంత సులువైన పని కాదని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com