ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీస్ యునైటెడ్ ఫోరం.. డేగ రవి రాఘవేంద్ర.. రాజ్యాంగం నీడలో భారతదేశంలోని బహుజనులు బ్రతుకుతున్నామని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ యునైటెడ్ ఫారం జాతీయ అధ్యక్షుడు డేగ రవి రాఘవేంద్ర అన్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని 35వ డివిజన్ లేక్ వ్యూ కాలనీ సెంటర్లో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ యావత్ ప్రపంచం భారతదేశ రాజ్యాంగాన్ని మెచ్చుకుంటుందని ప్రపంచ మేధావి అంబేద్కర్ అని కొనియాడారు.
జాతీయ ప్రధాన కార్యదర్శి కంటే పల్లి ప్రసాద్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ రని అన్నారు. రాష్ట్ర ఎస్ టి సెల్ అధ్యక్షులు మాకాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలలో ఆదర్శమని కష్టాల కడలిలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు ఇబ్రహీం చెంచయ్య నరసయ్య కొంచెం కోటేశ్వరరావు దేవల్ల వెంకటేశ్వర్లు సుబ్రహ్మణ్యం కే ప్రసాద్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.