జగన్ తిరుపతికి వెళ్లి లోపల పూజలు చేస్తారో లేదో నాకు తెలియదు కానీ ఆయన సంప్రదాయాన్ని గౌరవిస్తారని అందుకు ఆయన్ను మెచ్చుకోవాలి అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మీడియాలో మాట్లాడుతూ జగన్ తిరుపతి లడ్డూ తింటారో లేదో .. లేక అవి ఢిల్లీ వెళ్లి అమిత్ షాకు ఇచ్చుకోవడానికి పనికొస్తున్నాయో.. అంటూ వ్యంగ్యంగా అన్నారు. జగన్ క్రైస్తవుడని.. కానీ క్రైస్తవంలో కులాలు ఉండవని ఆయన గుర్తు చేశారు. క్రైస్తవంలో కులాలు లేనప్పుడు జగన్ మోహన్ రెడ్డి పేరులో రెడ్డి ఎందుకని నిలదీసారు.