ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవుడితో డిన్నర్ చేసేందుకు రూ.1779 కోట్లు ఖర్చు చేసిన రాజు!

national |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 09:30 PM

జపాన్ రాజు దేవుడితో కలిసి డిన్నర్ చేసేందుకు ఏకంగా రూ.1779 కోట్లు ఖర్చు చేశాడు. కేవలం 32 మందితో విందుకు ప్రజాధనాన్ని వృథా చేశాడు. జపాన్ రాజు నారుహితో సింహాసనం అధిరోహణ సందర్భంగా ఇటీవల భారీ వేడుకను నిర్వహించారు. స్థానిక సాంప్రదాయాల ప్రకారం.. ఆయన సూర్య భగవానుడిగా కొలిచే అమతెరసు‌ను స్మరించుకున్నారు. అనంతరం తమ సామ్రాజ్య ఇలవెల్పు షింటోను కొలిచారు. ఈ వేడుక కోసం ఇంధ్రభవనాన్ని తలపించే తాత్కాలిక దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. దవళ వస్త్రాలు ధరించిన రాజు నారుహి.. సూర్య భగవానుడికి నైవేద్యం సమర్పించారు. అనంతరం సిందూర వృక్షం ఆకులతో రూపొందించిన 32 ప్లేట్లలో తన కుటుంబ సభ్యులతో కలిసి విందును ఆరగించారు. అన్నం, చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలను ఆరగించారు. రైస్ వైన్‌తో వేడుకను ముగించారు. ఇక్కడ ఈ కార్యక్రమం సాగుతున్న సమయంలోనే జపాన్‌లోని వివిధ పుణ్యక్షేత్రాల్లోనూ ఇదే తరహా విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆహారాన్ని భక్తులకు అందించారు. ఆయన రాజుగా పదవిని చేపట్టారని తెలిపేందుకు ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖుల కోసం 46 వాహనాల కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు. ఈ విందుపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ సాంప్రదాయం సుమారు వెయ్యేళ్ల కిందటిదని, 1800 తర్వాత మళ్లీ ఇలాంటి వేడుక నిర్వహించలేదని పలువురు తెలిపారు. ఒకప్పుడు దేశం మొత్తం రాజుకు మద్దతు పలికేందుకు ఈ విందు వేడుకలను ఏర్పాటు చేసేవారని చెప్పారు. ఇప్పుడు ఈ వేడుక కోసం రూ.1779 కోట్లు వెచ్చించడం చాలా దారుణమని విమర్శిస్తున్నారు. ప్రజల సొమ్మును ఇలా వృథా చేయడం తగదంటున్నారు. ఈ విందుపై సుమారు 200 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో దావా వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com