అమరావతి : ఉదయం 11.30 కి రాష్ట్ర మంత్రిమండలి సమావేశం.ఏపీ మైనర్ మినరల్స్ కన్సెషన్ రూల్స్ లో సవరణలకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై భారీగా జరిమానా,జైలు శిక్ష వేసేలా చట్టంలో సవరణలు.ఈ నెల 14 నుంచి జరపతలపెట్టిన ఇసుక వారోత్సవాలు నిర్వహణపై క్యాబినెట్ లో చర్చ..ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం అమలుకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్..
ఏపీ కాలుష్య నిర్వహణ సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం.పట్టణాల్లో అక్రమ లే అవుట్ల క్రమబద్దీకరణపై చర్చించనున్న క్యాబినెట్..గ్రామ న్యాయాలయాల ఏర్పాటు,న్యావాదులకు సంక్షేమ నిధిపై చర్చించనున్న క్యాబినెట్.ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు 10 లక్షల ఆర్థిక సాయం ఇచ్చేందుకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.సింగపూర్ తో స్టార్టప్ ఏరియా రద్దుకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్..ప్రభుత్వ భూముల అమ్మకాలు, బిల్డ్ ఏపీ పై చర్చించనున్న క్యాబినెట్.చంద్రబాబు ఇసుక దీక్ష,రాజకీయ విమర్శలపైనా క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం