11వ బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొనడంలో భాగంగా నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈ సదస్సుకు ఆతిథ్యమిస్తున్న బ్రెజిల్ కు చేరుకుంటారు. రేపు, ఎల్లుండి (నవంబరు 13, 14 తేదీల్లో) జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొననున్నారు. తన విదేశీ పర్యటనకు ముందు మోదీ ట్విట్టర్ లో స్పందించారు. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారోతో చర్చలు జరుపుతానని, భారత్-బ్రెజిల్ దేశాల మధ్య ప్రగాఢ వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పేందుకు తన పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నానని తెలిపారు.