మండలంలో కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతొ జరుపు కున్నారు. ఈ ప్రాంతంలోఅదిక సంఖ్యాకులు దేవాంగ వర్గానికి చెందిన వారు. పౌర్ణమి రోజు నోములు నోచుకొని , మరుస టి రోజు సముద్ర స్నానాలు చేయటం సంప్రదాయంగా ఆచరిస్తారు. పౌర్ణమి ఘడియలు సోమవారం సాయంత్రం రావటంతో అదిక సంఖ్యలో సోమవారం నోములు నోచుకొని మంగళవారం సముద్ర స్నానాలు చేశారు. ఈ సందర్బంగా పోట్టి సుబ్బయ్యపాలెం బీచ్ భక్తులతో కిట కిట లాడింది. మహిళలు అత్యంతో భక్తితో ఒడ్డున దీపారాదనలు చేసి , పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులను సముద్రంలోని కి పోనివ్వకుండా మెరైన్ పోలీసులతో పాటు స్దానిక పోలీసులు బందో బస్తు నిర్వహించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలుగ కుండా పోలీసులు పకబ్బందీ ఏర్పాట్లు నిర్వహించారు.