ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తి శ్రద్దలతో కార్తీక స్నానాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2019, 06:27 PM

 మండలంలో కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతొ జరుపు కున్నారు. ఈ ప్రాంతంలోఅదిక సంఖ్యాకులు దేవాంగ వర్గానికి చెందిన వారు. పౌర్ణమి రోజు నోములు నోచుకొని , మరుస టి రోజు సముద్ర స్నానాలు చేయటం సంప్రదాయంగా ఆచరిస్తారు. పౌర్ణమి ఘడియలు సోమవారం సాయంత్రం రావటంతో అదిక సంఖ్యలో సోమవారం నోములు నోచుకొని మంగళవారం సముద్ర స్నానాలు చేశారు. ఈ సందర్బంగా పోట్టి సుబ్బయ్యపాలెం బీచ్‌ భక్తులతో కిట కిట లాడింది. మహిళలు అత్యంతో భక్తితో ఒడ్డున దీపారాదనలు చేసి , పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులను సముద్రంలోని కి పోనివ్వకుండా మెరైన్‌ పోలీసులతో పాటు స్దానిక పోలీసులు బందో బస్తు నిర్వహించారు. ట్రాఫిక్‌ కు అంతరాయం కలుగ కుండా పోలీసులు పకబ్బందీ ఏర్పాట్లు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com