ఈనెల 14వతేదీ నుంచి 21వతేదీ వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఇసుక ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్కువ ధరకు ఇసుక అమ్మితే రీచ్ లు సీజ్ చేస్తామన్నారు. అక్రమాలకు పాల్పడితే రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు. రేపు, ఎల్లుండిలోగా రేటు కార్డు డిసైడ్ చేయాలని జగన్ అధికారులకు ఆదేశించారు. జిల్లాల వారీగా రేటు కార్డులపై ప్రచారం చేయాలని సీఎం సూచించారు.